WELCOME TO DEAR MANTHANITES,PLS JOIN THIS WEB SITE:మన మంథని information resource centre for entertainment (వినోదం), custom (సంప్రదాయ), cultural (సంస్కృతి), literary (సాహిత్య) and devotional (భక్తి) aspects of all Telugu people. Here you will find some information and devotional Songs. Also included is a separate Bhakti page with collection of all familiar stotras, slokas, pujas and vratas in audio and lyrics format..

MNTYHistory In Telugu

శివ పురాణంలో ఓ కథనం ప్రకారం, ఒకానొకప్పుడు దండకారణ్యంలో నీటి ఎద్దడి ఏర్పడింది. సమీపంలోని ఋషిల కోరిక మేరకు గౌతమ మహర్షి వరుణుడిని ప్రసన్నున్ని చేసుకుని ఆయన అనుగ్రహంతో తన ఆశ్రమంవద్ద ఓ మడుగుని నిర్మింపజేశాడు. వరుణుడి కృపవలన ఆ మడుగులో ఎప్పుడూ నీళ్ళుండేవి. అప్పటికింకా గోదావరీ నది ఆవిర్భావం కాలేదు, గోదావరీ నదీ గర్భంలో ఈ శాఖ మడుగు నేటికీ చూడవచ్చు.కాలక్రమేణా నీటి కొరతలేని గౌతమ ఆశ్రమంలో ఎందరెందరో ఋషులు చేరడం మొదలైనది. ఓ సందర్భంలో మహర్షి శిష్యులలో ఒకరు గురువుగారి పూజార్థమై నీళ్ళు తేవడానికి వెళ్ళి మడుగులో ఋషిపత్నులు స్నానంచేస్తున్న కారణంగా నీళ్ళు తేలేకపోగా, గౌతమ మహర్షి భార్య అహల్యాదేవి స్వయంగా వెళ్ళి భర్త పూజకవసరమయ్యే నీళ్ళు తీసుకొచ్చింది. అయితే ఆమె అలా స్నానంచేస్తున్న ఋషి పత్నులను లెక్కచేయకుండా నీళ్ళు తీసుకోవడం కొందరు ఋషిపత్నులకి అవమానంగా తోచింది. వారి ఫిర్యాదు మేరకు కొందరు ఋషులు విఘ్నేశ్వరుడివద్దకి వెళ్ళి గౌతమ ఋషి ఆధిపత్యాన్ని సహించబోమని, ఆయనకెలాగైనా తెలిసివచ్చేలా చేయాలని అర్థింపసాగారు. గౌతముడి నిర్థోషిత్వాన్ని గురించి ఋషులకు సర్ది చెప్పడంలో విఫలుడయిన విఘ్నేశ్వరుడు ఋషులందరినీ శాంతపరచే ఉద్దేశ్యంతోనూ, లోకకళ్యాణార్థం ఒక చిన్న సంఘటన కల్పించాడు.విఘ్నేశ్వరుడు ఓ గోవురూపంలో గౌతముడి పంటచేలలో ప్రవేశించాడు, ఆ ఆవుని పొలమ్నుంచి బయటికి పంపే ఉద్దేశ్యంతో చేతికందిన గడ్డి పరకలు దానిపైకి విసిరి బెదిరించాడు, ఆ గడ్డి పరకలే శూలాలైనట్టు గోవు విలవిలాడి అక్కడే ప్రాణాలు విడుస్తుంది గోవు. గోహత్యా పాపం గౌతముడు చేశాడని ఆశ్రమం వదిలి వెళ్ళాల్సిందిగా ఋషులందరూ కోరతారు. గౌతముడు తన దివ్య దృష్టిద్వారా జరిగింది తెలుసుకుని, బ్రహ్మదేవుడు తన ద్వారా తలపెట్టిన "గోదావరీ ఆవిర్భావం"లో తన పాత్ర నిర్వహించడానికి ఆశ్రమం వీడి పశ్చిమంగా పయనించి "త్రయంబక" క్షేత్రంలో పరమశివుడిగురించి తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకొని తనకంటిన గోహత్యాపాతకం నుంచి విముక్తి లభించేందుకని గంగని తనతో పంపమని, సదా తన ఆశ్రమంలో పూజలందుకొమ్మని వరాలడిగాడు. ఆయన కోరినట్లే శివుడు తన జటాజూటాల్లోనుంచి గంగను విడిచి గౌతముడి వెంట ఆయన కూతురు గౌతమిగా పంపాడు.గౌతముడు సాక్షాత్తు గంగాదేవిని తన కూతురు గౌతమిగా వెంటతీసుకురాగ అమె జలాల స్పర్షతోనే చచ్చిపోయిన గోవు మళ్ళీ బ్రతుకుతుంది. దాంతో గౌతముడి "గోహత్యా పాతకం" తొలగిపోతుంది. దానితోబాటే దండకారణ్య ప్రాంతంలోని జనులకు శాశ్వత జలస్రోతంగా "జీవనది" గోదావరి లభ్యమయ్యింది. ఆ మీదట గౌతముడికిచ్చిన వరాన్ని పూర్తిచేస్తూ శివుడుకూడా ఈ గోదావరీ తీరంలో "గౌతమేశ్వరుడుగా" వెలిశాడు. నేటికీ మంథనిలో గోదావరీ తీరంపై "గౌతమేశ్వర" ఆలయం ఉంది. ఈ గౌతమేశ్వరుడే నేటికీ కూడా ప్రథమారాధ్యుడై పూజింపబడుతున్నాడు.ఆది శంకరులవారి సంపూర్ణ భారత యాత్రలో భాగంగా ఆయన క్రీ.పూ. 6వ శతాబ్ధంలో "మంత్రకూటం" సందర్శించినట్లుగానూ అక్కడి వైదికుల సంస్కృతినీ, పాండిత్యాన్ని మెచ్చుకున్నట్లుగానూ ఆయన యాత్రావిశాషాలను గురించి ద్వారకాపీఠంలోనూ, పుష్పగిరిపీఠంలోనూ స్థాపించబడిన శిలాఫలకాలు తెలుపుతాయి. స్థానికుడైన "కాశె శివప్ప" క్రీ.పూ. 6వ శతాబ్ధంలో కందర్బపురం రాజైన సోమదేవర రాజుకు చెందిన పశువులు గోదావరీ తీరం వెంబడి భద్రాచలం నుంచి మంత్రకూటం వరకు మేతకు తీసుకుపోబడేవని పేర్కొన్నాడు


 
Design by Mana Manthani Themes | Bloggerized by avadhanula prasad - Mana Manthani | manthani